చైతూకు ఓకేనా.. మీకు అర్ధమవుతోందా?

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన, అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.

ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

రష్మిక కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ‘గీతా గోవిందం’ నిలిచిందనే సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం పలు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ హీరోయిన్‌కు మరో క్రేజీ ఆఫర్‌ వచ్చి పడింది.

గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ తన నెక్ట్స్ మూవీని అక్కినేని నాగచైతన్యతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో తనకు బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన రష్మికనుమరోసారి తీసుకోవాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్.

కాగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, మరి ఈ సినిమాను ఓకే చేస్తుందా అనేది డౌటే అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఏదేమైనా అక్కినేని హీరోతో సినిమా చేయడానికి రష్మిక ఓకే అంటోందా లేక నో చెబుతుందా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మరి ఈ కన్నడ బ్యూటీ నిర్ణయం ఏమై ఉంటుందో తెలియాలంటే మాత్రం ఆమె అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘర్షణ