ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టభద్రులు ఝలక్ ఇవ్వనున్నారా?

త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.అయితే తెలంగాణ ప్రభుత్వంపై పట్టభద్రులందరు పెద్ద ఎత్తున గుస్సాగా ఉన్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చేపట్టకపోవడం, వయసు మీరుతున్న నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు.

అయితే అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోలేక పోయారు.

తమ సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈసారి పట్టభద్రులు షాక్ ఇచ్చే అవకాశం ఉంది.

నేను ఎంతగానో పోరాడతానని చెప్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటలు విన్న పట్టభద్రుల నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది.

అంతేకాక ఎమ్మెల్సీ పల్లా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పల్లా ఓడిపోతే టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.

ఏది ఏమైనా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

వైరల్ వీడియో: డాన్స్ చేస్తూ ఉన్నట్లుండి మృతి చెందిన అమ్మాయి.