ఆల్కహాల్ తో కరోనా వైరస్ ను అరికట్టవచ్చా....

ఇటీవలకాలంలో మహమ్మారి కరోనా వైరస్ చైనా దేశంలో విజృంభిస్తే ఇప్పటికే వేల సంఖ్యలో మరణించారు.

అంతేగాక ఈ వ్యాధి లక్షణాలు సోకి పలువురు ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

అయితే తాజాగా ఈ వైరస్ భారతదేశంలో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది.అంతేగాక అధికారికంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు గా ఐదు కరోనా వైరస్ కేసులు  నమోదైయినట్లు సమాచారం.

దీంతో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ వైరస్ ని అంతమొందించేందుకు మందు కనిపెట్టాలని అయితే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ కరోనా వైరస్ విరుగుడుకి సంబంధించి కొన్ని వార్తలు నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆల్కహాల్ సేవించడం వల్ల వైరస్  సోకదంటూ పలు వదంతులు పుట్టిస్తున్నారు.

దీంతో ఈ వైరస్ ను చూసి భయపడుతున్నటువంటి కొందరు మద్యాన్ని అలవాటు చేసుకుంటున్నారు.

దీంతో మద్యం వ్యాపారులు మాత్రం బాగానే లాభపడుతున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి వైద్య శాస్త్రవేత్తలు మద్యంతో కరోనా వైరస్ ని తగ్గించాలంటూ కొట్టిపారేశారు.

అంతేగాక గతంలో పలువురు వైద్యులు  ఆల్కహాల్ కలిసినటువంటి లిక్విడ్ లను ఉపయోగించి చేతులను శుభ్రంగా కడుక్కోవడం వలన కొంతమేర ఈ వైరస్ సోకకుండా అరికట్టవచ్చని చెప్పారు.

దీంతో వక్రీకరించి రాసినటువంటి కొన్ని వార్తలను చదివిన యువకులు ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

"""/" / అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానం అయినటువంటి తిరుపతి శ్రీవారి ఆలయంలో కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తి ప్రవేశించాడంటూ పలు వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అందుకు గానూ తైవాన్ కి  చెందినటువంటి ఆ వ్యక్తిని పరిశీలించిన అనంతరం వైద్యులు కరోనా వైరస్ సోకే లేదంటూ నిర్ధారించారు.

దీంతో లేనిపోనివి  ఊహించుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ పలువురు వైద్యులు సూచిస్తున్నారు.

స్టార్ హీరో విజయ్ కు భారీ షాక్.. ఈ స్టార్ హీరో సినిమాకే ఇలాంటి సమస్యలు వస్తాయా?