లడఖ్‌లో దెయ్యాల తిరిగే ప్రాంతం.. అక్కడ టూరిస్టులు ఏం విసిరేస్తారో తెలిస్తే..?

లడఖ్‌( Ladakh ) చాలా విచిత్రమైన ప్రదేశమని చెప్పుకోవచ్చు ఎక్కడికి వెళ్లాలంటే ఒక పెద్ద సాహసం చేసినట్లే అవుతుంది.

లడఖ్‌లో ఉన్న ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలను ట్రావెల్స్ బయటపడుతుంటారు.తాజాగా ఒక ట్రావెల్ వ్లాగర్( Travel Vlogger ) లడఖ్‌లో తిరుగుతున్నప్పుడు చాలా విచిత్రమైన దేవాలయాన్ని కనుగొన్నాడు.

ఈ ప్రదేశంలో దెయ్యాలు కూడా ఉన్నాయని ఆయన వీడియోలో తెలిపాడు.దెయ్యాలు తిరిగే ప్రాంతంలో( Haunted Place ) ఉన్న ఈ దేవాలయంలో భక్తులు పూలు కాకుండా వాటర్ బాటిళ్లు( Water Bottles ) సమర్పిస్తున్నారు.

ఈ విషయం తెలిసి నెటిజన్ల ఆశ్చర్యపోయారు.కొందరు దీన్ని భారతదేశంలోని ఒక అద్భుతం అంటే, మరికొందరు ఆ దేవాలయం( Temple ) స్థానంలో వేరే ఏదైనా చేయాలని సూచించారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వ్లాగర్ తన బైక్‌పై ప్రయాణిస్తూ చాలా చోట్ల వీడియోలు తీస్తాడు.

"""/" / ఆ వ్యక్తి జైపూర్ నుంచి లఢాఖ్ వరకు బైక్‌పై ప్రయాణం చేశాడు.

గత ఏడాది ఆగస్టులో ఆయన ఈ ప్రయాణం ఒక నెలలో పూర్తి చేశానని తన అభిమానులకు చెప్పాడు.

మార్గమధ్యంలో పర్వతాల మధ్య ఒక దేవాలయం కనిపించింది.ఆ దేవాలయం ముందు వందలకొద్దీ బాటిళ్లు ఉన్నాయి.

అవి ఎవరో వేసిన చెత్త కాదు, అక్కడికి వచ్చేవాళ్ళు తమ ఇష్టంతో నీటి బాటిళ్లు సమర్పిస్తున్నారని ఆయన చెప్పాడు.

"""/" / అక్కడ వాటర్ బాటిళ్లు సమర్పించడానికి కారణం ఒక ట్రక్ డ్రైవర్ విషాద మరణం.

1999లో ఆ డ్రైవర్ ఆ దేవాలయం దగ్గర దాహంతో చనిపోయాడట.అప్పటి నుంచి అక్కడ నుంచి వెళ్లేవాళ్ళంతా నీటి బాటిల్‌ ఇస్తున్నారు.

అయితే చనిపోయిన తర్వాత డ్రైవర్ ఆత్మగా అక్కడే తిరుగుతున్నారని కొంతమంది అంటున్నారు.ఈ వీడియోకి కోటి కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

అయితే ఇక్కడ వాటర్ బాటిల్ పడేయడం కంటే ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం బెటర్ కదా అని చాలామంది సలహా ఇస్తున్నారు.

విశ్వంభర మూవీ ప్రొడ్యూసర్లపై వడ్డీ భారం పెరగనుందా.. చిరు సినిమాకే ఎందుకిలా?