జామ పండు ఉండగా ఆరోగ్యం గురించి టెన్షన్ ఎందుకు..

పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి.అందుకే పండ్లు వీటిని రోజూ తింటే.

పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాంటి పండ్లలో జామ పండు చాలా మంచిది.

అయితే జామపండును పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు.ఎందుకంటే జామ పండు తినడానికి రుచికరంగా కాకుండా జామకాయను కోసి దాని ముక్కలకు నల్ల ఉప్పు, కొంచెం మిర్చి తగిల్చుకొని చాలా మజాగా ఉంటుంది.

అయితే దీనికి రుచి పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా జామ ఎంతో మేలు చేస్తుంది.

అయితే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు జామపండులో పుష్కలంగా ఉంటాయి.

కాబట్టి తరచూ ఆరోగ్యం పాడవకుండా డాక్టర్ లు వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.

అయితే జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.జామ కాయ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కడుపు నొప్పితో బాధపడుతున్నా లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ప్రతిరోజూ ఒక జామపండు తినడం చాలా మంచిది.

అలాగే ఇషి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. """/"/ అంతే కాకుండా ఉదయం కడుపు కూడా సులభంగా శుభ్రం అవుతుంది.

అలాగే గుండె సమస్యలు కూడా దూరం అవుతాయి.మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జామపండును మీ డైలీ డేట్ లో చేర్చుకోవాలి.

జామకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అంతే కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జామకాయ ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.ఎందుకంటే జామలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

దీని కారణంగా ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో నటించనున్న స్టార్ హీరోయిన్…