హీరో రాజేంద్రప్రసాద్తో కాకుండా బాబు మోహన్తో సౌందర్య డ్యాన్స్.. ఎందుకో తెలుసా.. ?
TeluguStop.com
‘మాయలోడు’ సినిమా( Mayalodu Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ తీస్తున్న సమయంలో నటుడు రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ ఎస్.వి.
కృష్ణారెడ్డి "నేను గొప్ప అంటే నేనే గొప్ప" అనుకుంటూ గొడవపడ్డారు.రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) కారణంగా ఆ మూవీ దర్శకనిర్మాతలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు.
ఒక్క సాంగ్ షూట్ తప్ప ‘మాయలోడు’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సమయంలో ఆ గొడవ జరిగింది.
కృష్ణారెడ్డిని( SV Krishna Reddy ) రాజేంద్రప్రసాద్ తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
"నీ డైరెక్షన్ వల్లే సినిమాలు హిట్ అవుతాయనుకోకు నా వల్లే సినిమాలు ఆడుతున్నాయి.
" అంటూ రాజేంద్రప్రసాద్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడట.అయితే ఇలా గొడవలు పడితే సినిమా పూర్తి కాదని కృష్ణారెడ్డి తగ్గారు.
ఒకరోజు రాజేంద్రప్రసాద్కి ఫోన్ చేసి ‘సౌందర్య( Soundarya ) డేట్స్ దొరికాయి.రిమైనింగ్ సాంగ్ ఒకటి పూర్తి చేద్దాం, సార్" అని అడిగారు.
కానీ రాజేంద్రప్రసాద్ సరైన రిప్లై ఇవ్వలేదు."డబ్బింగ్ చెప్పాలి.
పాట పూర్తి చేయాలి.నువ్వు అప్పుడే సినిమా రిలీజ్ కూడా షెడ్యూల్ చేసావ్.
" అంటూ వెటకారంగా మాట్లాడాడు."డబ్బింగ్కి ఒక్కరోజు మాత్రమే టైమ్ ఇస్తా, అది కూడా 9-1, ఆపై 2-3" అని ఈ హీరో తెలిపాడట.
ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తయ్యే అవకాశమే లేదు కాబట్టి నీ సినిమా అనుకున్న టైమ్కి రిలీజ్ కాద"ని అంటూ కృష్ణారెడ్డికి ఆందోళన పుట్టించాడట.
"""/" /
సింగల్ డేలో డబ్బింగ్ కష్టమని కృష్ణారెడ్డి ఆలోచిస్తూ చివరికి ఒక మంచి ఐడియాకి వచ్చారు.
ఎడిటర్తో సెపరేట్ పీసెస్గా ఉన్న 1200 అడుగుల సినిమాని ఒకే రీల్గా ఎడిట్ చేయించేశారు.
దానివల్ల నెక్స్ట్ డే 9:00 నుంచి ఒకటింటిలోపే డబ్బింగ్ చెప్పడం పూర్తయింది.డబ్బింగ్ అప్పుడే అయిపోవడంతో రాజేంద్రప్రసాద్ ఆశ్చర్యపోయాడు.
ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది కదా అది ఎలా పూర్తి చేస్తావో చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఒక్క సౌందర్యతోనే సాంగ్ కంప్లీట్ చేసుకోమ్మంటూ వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు. """/" /
అప్పుడే కృష్ణారెడ్డికి మరో అదిరిపోయే ఐడియా వచ్చింది.
బాబు మోహన్ ను( Babu Mohan ) ఈ పాటలో యాక్ట్ చేయించాలని భావించారు.
అందుకు ఈ కమెడియన్ ఒప్పుకున్నారు.సౌందర్య కూడా కృష్ణారెడ్డి మాట తీసేలేకపోయారు.
ఈ విషయం తెలిసి రాజేంద్రప్రసాద్ వెంటనే తానే ఆ పాటలో చేస్తానని మేనేజర్ ద్వారా చెప్పించాడు కానీ కృష్ణారెడ్డి తాను ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పను అని చెబుతూ బాబు మోహన్ తోనే ఆ పాట షూట్ చేయించారు.
ఆ పాటే ‘చినుకు చినుకు అందెలతో.’ ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది.
బాబు మోహన్, సౌందర్యల డ్యూయెట్ సాంగ్ వెనుక ఉన్న కథ అదన్నమాట!.
లడ్డు వివాదం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం.? జస్ట్ ఆస్కింగ్.?