బాలయ్య టాక్ షో కు నాగార్జున దూరంగా ఉండడానికి అసలు కారణం ఇదేనా?

నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సినీ ప్రముఖులు వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఫిబ్రవరి 4వ తేదీ పూర్తి కానుంది.

ఫిబ్రవరి 4వ తేదీ మహేష్ బాబు హాజరైన ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు.

ఇలా ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ సీనియర్ హీరోలు అయిన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి వారు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు.

అయితే చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవి అనే వ్యక్తి తెలియజేశారు.

అయితే నాగార్జున కూడా ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదు? ఈ కార్యక్రమానికి నాగార్జున దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

"""/"/ అసలు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమం కోసం నాగార్జునను సంప్రదించలేదని సమాచారం వినబడుతుంది.

అయితే ఈ కార్యక్రమం షూటింగ్ జరిగే సమయంలో నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం ద్వారా బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేరనే ఉద్దేశంతోనే నిర్వాహకులు అతనిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సమాచారం.

అయితే ఈ ఏడాది చివరిలో రెండవ సీజన్ ప్రారంభం అవుతుందని మరి ఆ కార్యక్రమానికైనా నాగార్జునను ఆహ్వానిస్తారో లేదో వేచి చూడాలి.

భద్రాద్రి జిల్లాలో గన్ మిస్ ఫైర్ .. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి