నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆగడానికి కారణం అదేనా!

అభిమానుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పటికీ కలిసి మెలిసి ఒక కుటుంబం లాగానే ఉంటారు.

కొంతమంది స్టార్స్ అయితే , సరిసమానమైన ఇమేజి ఉన్నప్పటికీ కూడా సొంత అన్నదమ్ములు లాగా ఉంటారు.

వాళ్ళని అలా చూస్తే అభిమానుల కళ్ళ నుండి ఆనందం తో నీళ్లు కారుతాయి.

అలాంటి వారిలో మనం ముందుగా అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) మరియు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మాట్లాడుకోవాలి.

దశాబ్దాల నుండి వీళ్లిద్దరి స్నేహం ఎంతో అమూల్యమైనది.చిరంజీవి ని నాగార్జున తన సొంత అన్నయ్య లాగా భావిస్తాడు.

ఇద్దరు స్టార్ స్టేటస్ విషయం లో తక్కువేమి కాదు.ఇరువురి హీరోల అభిమానులకు సోషల్ మీడియా లో మరియు బయట ఎన్నో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.

కానీ హీరోలు మాత్రం సొంత అన్నదమ్ములు లాగానే ఉంటారు.ఇంత మంచి స్నేహ బంధం ఉన్నపటికీ కూడా వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

అందుకు కారణాలు ఏవైనా కావొచ్చు కానీ చిరంజీవిని హీరో గా పెట్టి నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ) బ్యానర్ లో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు.

ఈ చిత్రానికి దర్శకుడిగా కె.రాఘవేంద్ర రావు కూడా ఫిక్స్ అయ్యారు.

సౌందర్య ఇందులో హీరోయిన్, రెండు పాటలు మరియు 10 శాతం కి పైగా టాకీ పార్ట్ పూర్తి చేసారు.

"""/" / కానీ రాఘవేంద్ర రావు కి( Raghavendra Rao ) సినిమా కథ ని మరోసారి పరిశీలించి చూస్తే ఇది ఎందుకో చిరంజీవి ఇమేజి కి తగ్గ సినిమా కాదని అనిపించిందట.

కథలో ఎక్కడో ఎదో మిస్ అవుతుందని అనుకున్నాడట.ఎంత ప్రయత్నం చేసి కథ ని సరిచేయాలని చూసిన అది చిరంజీవి ఇమేజి వర్కౌట్ అయ్యే సబ్జెక్టు లాగ అనిపించలేదు.

ఇదే విషయాన్నీ ముందుగా రాఘవేంద్ర రావు గారు నాగార్జున ని పిలిచి చెప్పాడట.

నమ్మకం లేకపోతే సినిమాని ఆపేద్దాం లేండి , వేరే ఏదైనా మంచి కథ ఉంటే చూద్దాం అని అన్నాడట నాగార్జున.

"""/" / మరి చిరంజీవి డేట్స్ ని ఏమి చేస్తావు, అతను మనకి నాన్ స్టాప్ గా నెల రోజులు డేట్స్ ఇచ్చాడు కదా అని నాగార్జున తో అనగా, ఆయనకి నేను నచ్చచెప్పుకుంటాను లేండి ఏమి పర్వాలేదు అని అన్నాడట నాగార్జున.

చిరంజీవి కి ఈ విషయం చెప్పగా, ఆయన చాలా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడట.

కానీ నెల రోజులు డేట్స్ వేస్ట్ అయ్యాయి కదా, ఈ నెల రోజులు ఫారిన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటానులే అని నాగార్జున తో చెప్పాడట.

అలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.

మహా నటికి నివాళులు అర్పించిన అనసూయ.. భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!