బాయ్స్ సినిమాలో నటించిన వారంతా స్టార్స్ అయ్యారు ఒక్క మణికందన్ తప్ప ..కారణం ఏంటి ?

బాయ్స్ .శంకర్ డైరెక్షన్ లో 2002 లో వచ్చిన సినిమా.

చదువు మరియు కెరీర్ ప్రాముఖ్యతను తెలియచేస్తూ నలుగురు యువకుల జీవితాల్లో జరిగిన సంఘటనల పరిణామాలను తెలియచేసిన చిత్రం.

ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమాలో నలుగురు హీరోలుగా నటించిన వారు సిద్ధార్థ్, థమన్, మణికందన్, నకుళ్.

వీరితో పాటు జెనీలియా సైతం మంచి పాత్ర పోషించింది.ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోలకు మొదటి సినిమా.

"""/"/ జెనీలియా మాత్రం హిందీ లో తుజే మేరీ కోసం సినిమా సైన్ చేసింది కానీ అప్పటికి షూటింగ్ మొదలు కాలేదు.

పార్కర్ పెన్ యాడ్ లో ఆమెను చుసిన శంకర్ బాయ్స్ సినిమాలో ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అందరి స్టార్స్ తిరిగిపోయాయి.నిజం చెప్పాలంటే సిద్దార్థ్ ఆ తర్వాత ఇండియా మొత్తం చుట్టేసి అన్ని భాషల్లో మంచి గురింపు తెచ్చుకున్నాడు .

ఇక జెనీలియా ని కూడా మనం చూసాం.ఆమె హిందీ హీరో రితేష్ దేశముఖ్ ని పేమించి పెళ్లి చేసుకుంది.

అంతకుముందు తెలుగు మరియు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

ఇక నకుళ్ అప్పటికే దేవయాని తమ్ముడిగా ఇండస్ట్రీ కి తెలుసు కాబట్టి బాయ్స్ సినిమా అతడికి మంచి పేరును తెచ్చిపెట్టింది.

"""/"/ ఓ వైపు సినిమాలు చేస్తూనే ప్రస్తుతం బుల్లి తెర పై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఇక థమన్.ఇతడు నటించడం పక్కన పెట్టి తెలుగు లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్థుహం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ఇక ఎటొచ్చి మిగిలింది కేవలం మణికందన్.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని మణికందన్ ఈ సినిమా తర్వాత హీరో గా కాలేకపోయాడు.

ఆలా అని విలన్ గా ట్రై చేసిన వర్క్ అవుట్ కాలేదు.ఇక 20 ఏళ్లలో కేవలం ఎనిమిది సినిమాల్లో మాత్రమే నటించాడు.

స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోకపోవడం అతడు చేసిన పెద్ద తప్పు అని చెప్పుకోవచ్చు.ఇక లుక్ విషయం లో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు.

మరో వైపు పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వలేదు.40 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోలేదు.

ఇక ఇప్పటికైనా ఎవరైనా పిలిచి మళ్లి అవకాశం ఇవ్వకపోతారా అని సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.

నేడు ఢిల్లీకి చంద్రబాబు ! అమిత్ షా కరుణిస్తారా ?