ఎంతో ప్రాణంగా ప్రేమించిన మొదటి భర్తకు మంచు లక్ష్మి ఎందుకు విడాకులు ఇచ్చింది ?

మంచు లక్ష్మి( Manchu Lakshmi ) వికీపీడియా ఓపెన్ చేస్తే ఆమె భర్తల గురించి ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం తెలీదు.

ప్రస్తుతం రెండవ పెళ్లి చేసుకున్న ఆండ్రీ శ్రీనివాస్( Andy Srinivas ) గురించి మాత్రమే అందరికీ తెలుసు.

కానీ ఆమె మొదటి భర్త గురించి అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు అవగాహన లేదు.

కానీ ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజ్ మేట్ అయిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది.

తన ప్రేమను మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) కాదన్నాడని కోపంతో ఆయన అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లిన సమయంలో ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఆర్యసమాజ్ లో వివాహం చేస్తుంది.

"""/" / అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు లక్ష్మి విడాకులు తీసుకోవడం వెనక కారణం మోహన్ బాబు అని అప్పటి వారికి అందరికీ తెలుసు.

ఆమె ప్రేమ పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం చెప్పాడు కానీ చెప్పిన వినకుండా ఆమె వివాహం చేసుకోవడంతో దాసరి నారాయణరావు మురళీమోహన్ వంటి వారు మధ్య వర్తులుగా మారి పంచాయితీ కూడా చేశారు.

అలాగే మొదటి భర్త పేరు లండన్ శ్రీనివాస్.( London Srinivas ) అతడికి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా ఏడాది పాటు చాలా ఇబ్బందులు పెట్టాడట మోహన్ బాబు.

అంతేకాదు అతని కుటుంబ సభ్యులను బంధువులను కూడా రౌడీలను పెట్టి బెదిరించాడని అప్పటి వారు చెప్పుకునేవారు.

"""/" / అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఆయన బెదిరింపులు భరించలేక ఓసారి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చిన మంచు లక్ష్మి మళ్ళీ ఆ ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదట.

ఎంత ప్రయత్నించినా ఆమె మళ్ళీ తిరిగి రాలేకపోయిందట.అప్పటి పోలీసులకు ముఖ్యమంత్రి వరకు కూడా లండన్ శ్రీనివాస్ మొరపెట్టుకున్న ఎవరు పట్టించుకోలేదు.

చివరికి తన భర్తకు ముప్పు ఉంది కాబట్టి ఇక ఆ వివాహంలో అర్థం లేదు అని తెలుసుకున్న మంచు లక్ష్మి అతడితో విడిపోయింది.

ఇండియాలోనే ఉంటే తన మనసు మళ్ళి మారుతుంది అని మంచి మోహన్ బాబు, లక్ష్మిని అమెరికా పంపించి థియేటర్ కోర్సు నేర్పించారు.

అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది అని తెలియగానే తీసుకొచ్చి ఆండ్రీ శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారు.