‘లియో’ను అందుకే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారట!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు.

ఇక ఈ ఏడాది అప్పుడే వారిసు సినిమాతో ఫ్యాన్స్ ను అలరించిన ఈయన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఆ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

"""/" / విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'లియో'( Leo Movie ).

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల బరిలో ఉంది.

అయితే ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని అనుకోలేదట.

కానీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) అంతకుముందే విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

దీంతో లియో సినిమాను ఎలాగైనా పాన్ ఇండియా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యి స్క్రిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి పాన్ ఇండియన్ వ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చేలా లోకేష్ తీర్చిదిద్దారట.

అందుకే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఈ సినిమాలో భాగం చేసుకుని నార్త్ ఆడియెన్స్ లో కూడా క్రేజ్ వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.

"""/" / చూడాలి లోకేష్ విక్రమ్ కు మించిన హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.లోకనాయకుడు కమల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నట్టు తెలుస్తుంది.

టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత…..