నవీన్ పోలిశెట్టి ఎందుకు సినిమాలను లేట్ చేస్తున్నాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty ).

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమైన ఈయన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

అయితే ఈయన చేసే సినిమాల సెలక్షన్ అనేది చాలా బాగుంటుంది.అందుకే ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఇప్పటి వరకు ఈయన మూడు సినిమాలను మాత్రమే చేశాడు.

"""/" / ఆయన సినిమా సెలక్షన్ చూస్తే మతిపోతుంది.యంగ్ హీరోలు అందరూ కూడా వరుస సినిమాలను చేస్తు ముందుకు వెళ్తుంటే ఈయన మాత్రం రెండు సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున చేస్తూ చాలా నిదానంగా సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నాడు.

దానికి కారణం ఆయనకి ఫ్లాప్స్ వస్తే నచ్చదట.అందుకే ఎలాంటి పరిస్థితిలో అయిన కూడా తను సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలని ఉద్దేశ్యం తో మంచి స్క్రిప్ట్ లను రెడీ చేయించుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పటికే నవీన్ పోలిశెట్టి మీద అభిమానుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. """/" / మరి దానికి తగ్గట్టుగానే ఆయన సినిమా ఇండస్ట్రీలో రాణిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ఒక మంచి క్రేజ్ నైతే ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత మహేష్ డైరెక్షన్ లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

అయినప్పటికీ ఆయన ఇప్పటివరకు మరొక సినిమా అయితే కమిట్ అవ్వలేదు.ఇక కథలను వింటూ కూర్చున్న నవీన్ పోలిశెట్టి రీసెంట్ గా ఒక డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024