జాతి రత్నాలు సినిమా చేయను అని చెప్పాను : ఫరియా 

2021లో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణ సంస్థ ద్వారా అనుదీప్ దర్శకత్వంలో జాతి రత్నాలు సినిమా( Jathi Ratnalu Movie ) వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ గా నటించగా, హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) నటించింది.

అయితే ఈ సినిమ లో చిట్టి పాత్ర ద్వారా ఫరియా మంచి పేరు సంపాదించుకుంది.

అయితే మొదట చిట్టి పాత్రని( Chitti Character ) ఫరియా రిజెక్ట్ చేసిందట.

దాని వెనక పెద్ద కథ జరిగిందనే విషయం ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిట్టి తెలపడం విశేషం.

"""/" / ఫరియా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉండగా ఆ కాలేజ్ కి సంబంధించిన ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) వచ్చారట.

అక్కడ నాగ్ అశ్విన్ ని పలకరించడానికి ఫరియా వెళ్లిందట.అప్పటికే ఫరియా థియేటర్స్ చేస్తుండట.

నటన అంటే చాలా ఇష్టం కూడా ఉందట.అలాగే చూడటానికి చాలా హైట్ గా మంచి పర్సనాలిటీ తో అందంగా కూడా ఉన్న ఫరియా ని చూడగానే నాగ్ అశ్విన్ తన సినిమాలో నటిస్తావా అని అడిగారట.

అప్పుడు పిలిమ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న ఆడిషన్ అవకాశాన్ని వద్దు అనుకుందట.

"""/" / చాలా కాన్ఫిడెంట్ గా తనకు అడ్మిషన్ దొరుకుతుంది అని ఎదురుచూసిన ఫరియా కి అందులో అవకాశం దొరకలేదు.

దాంతో చాలా రోజుల తర్వాత నాగ్ అశ్విన్ కి ఫోన్ చేసి తను ఆడిషన్ కి రావాలనుకుంటున్న విషయాన్ని చెప్పిందట.

అలా ఆడిషన్ కి( Audition ) వెళ్ళిన తర్వాత అక్కడ ఆడిషన్ ద్వారా ఫరియా సెలెక్ట్ అయిందట.

అలా మొదట నాకు అశ్విన్ పిలిచే అవకాశం ఇస్తే ఫరియా రిజెక్ట్ చేసిన విషయాన్ని తన ఇంటర్వ్యూలో తెలియజేసింది.

ఇక ఈ ఏడాది ఫరియా ఇప్పటికే ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku Movie ) అనే సినిమాలో నటించగా, మరో సినిమా ప్రొడక్షన్ లో ఉంది.

వైరల్ వీడియో: భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన రోహిత్.. ఫైనల్లో టీమిండియా..