ఎవరితో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎందుకు..?: పవన్ కల్యాణ్

రానున్న రెండు, మూడు రోజుల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ క్రమంలో ఉమ్మడి కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు.వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే లక్ష్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్నది వైసీపీకి ఎందుకని ప్రశ్నించారు.30 మంది ఎంపీలు ఉన్నది కాఫీలు, టీలు తాగడానికా ఎద్దేవా చేశారు.

జనసేన - టీడీపీ కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.ఢిల్లీలో బీజేపీ నేతలకు కూడా ఇదే విషయం చెప్పినట్లు పేర్కొన్నారు.

జీ-20 సదస్సు జరుగుతుంటే చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పవన్ తన కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారని విమర్శించారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత పంపకాలు సరిగా జరగలేదన్నారు.ఎలాంటి అధ్యయనం లేకుండా పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేశారని తెలిపారు.

దేవర మూవీ సక్సెస్‌లో ఎన్టీఆర్ కంటే అతనిదే ఎక్కువ పాత్ర..?