అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి?

అశ్వమేధ యాగం గురించి మనం రామాయణంలో విన్నాం.లవ కుశులు పుట్టాక శ్రీ రామ చంద్రుడు ఈ అశ్వమేధ యాగాన్ని చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ యాగానికి వాడిన గుర్రాన్నే లవ కుశులు ఆపారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే.

అయితే ఈ అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి.

ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం.

అలాగే తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ఈ అశ్వమేధ యాగాన్ని చేస్తుంటారు.

ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు.

ముందుగా గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.ఆ తర్వాత ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు.

ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ.ఒక్క కుక్కను చంపి సంకేతంగా శిక్షను తెలియజేస్తారు.

ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సర కాలం యధేచ్చగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు.

ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు.అశ్వం శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు.

గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందుల నుండి కాపాడటానికి తోడుగా రాజ కుమారులు లేదా సేనాధిపతులు ఉంటారు.

నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞ యాగాదులు జరుపుతారు.

నేటి షెడ్యూల్ :   రాయలసీమలో షర్మిల.. గోదావరి జిల్లాలో జగన్