ఢిల్లీలో రేవంత్ బృందం ఎవరెవరిని కలిశారు .. వేటిపై చర్చించారంటే ? 

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,( CM Revanth Reddy ) డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై పార్టీ అగ్రనేతలతో పాటు, కేంద్ర మంత్రులను కలిసి అనేక అంశాలపై చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు.

  నిన్న ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని( Sonia Gandhi ) రేవంత్ రెడ్డి , బట్టి విక్రమార్క కలిశారు.

ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై సోనియాతో వీరు చర్చించారు.  రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియా దృష్టికి రేవంత్ , భట్టి విక్రమార్క వివరించారు.

అంతకుముందే కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తోనూ( CR Patil ) రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

"""/" / హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసిలో చేరుతుందని , దానిని శుద్ధి చేసేందుకు కేంద్రం సహకరించాలని రేవంత్ కోరారు.

జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసిలో మురుగునీటి శుద్ధి పనులకు 4 వేల కోట్లు,  గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ లతో నింపే పనులకు 6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతోనూ( Rahul Gandhi ) రేవంత్, భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,  కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ లను కలిసామని,  """/" / ఎన్నికలకు ముందు ప్రజలు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామని,  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,  10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ , గ్యాస్ సబ్సిడీ,  ఉచిత కరెంటు , రైతు రుణమాఫీ చేసిన అంశాలపై రాహుల్ కు వివరించామని విక్రమార్క తెలిపారు.

వరంగల్ లో నిర్వహించనున్న రైతు రుణమాఫీ ,కృతజ్ఞత సభకు రావలసిందిగా రాహుల్ ను కోరామని భట్టి విక్రమార్క తెలిపారు.

భవిష్యత్తులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు.

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్