Manisha Koirala : మనీషా కొయిరాలా చేసిన ఈ పాత్రను రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్స్ ఎవరు ?
TeluguStop.com
మనిషా కొయిరాలా, అరవింద్ స్వామి( Arvind Swami ) హీరో హీరోయిన్స్ గా నటించిన బాంబే సినిమా( Bombay ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమా వచ్చి దాదాపుగా 28 ఏళ్ళు అవుతుంది.అయినా కూడా ఆ సినిమాలోని పాటలు, సన్నివేశాలు హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటాయి.
ఇప్పటికీ టీవీ లో వచ్చినా కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.
ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి కన్నా కూడా మనిషా కొయిరాలా పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.
మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో మనీషా ( Manisha Koirala )కన్నా ముందు మరో ఇద్దరు హీరోయిన్స్ ని షైలా భాను పాత్రా కోసం అనుకున్నారట.
"""/" /
మరి బాంబే సినిమాలో నటించడానికి అనుకున్న ఆ హీరోయిన్స్ ఎవరు ? ఏ కారణాల చేత వారు ఈ సినిమాను వద్దు అనుకున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదట మణి రత్నం ఈ సినిమాకి కథ రాసినప్పుడు 1994లో ఐశ్వర్య రాయ్( AishwaryaRaiBachchan ) ని సంప్రదించారట.
షైలా భాను గా ఐశ్వర్య అయితే బాగుంటుందని మణి రత్నం అనుకున్నప్పటికీ అప్పటికె ఆమె మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న కారణంగా అక్కడ సంతకం చేసింది.
అందువల్ల మణిరత్నం ఇచ్చిన ఆఫర్ ను ఆమె తీసుకోలేకపోయింది. """/" /
ఇక ఐశ్వర్య రాయ్ తర్వాత వెంటనే మణిరత్నం కరిష్మా కపూర్( Karishma Kapoor ) ని ఈ సినిమాలో షైలా భాను పాత్రలో నటింపజేయాలని అనుకున్నాడట.
అప్పటికే బాక్సాఫీస్ వద్ద ఒక హాట్ యాక్ట్రెస్ గా కరిష్మా కి మంచి పేరుంది.
అందుకే ఇద్దరు పిల్లల తల్లిగా నటించడానికి కరిష్మా ఒప్పుకోక పోవడంతో ఈ పాత్రను ఆమె వదులుకోవాల్సి వచ్చింది.
ఆ తరువాత మనీషా కొయిరాలా బాంబే సినిమా కోసం ఓకే అని చెప్పి సంతకం చేసింది.
అలాగే ఈ సినిమాలో నటించిన మనీషా కు ఫిలిం ఫెర్ అవార్డు కూడా దక్కించుకుంది.
ఇలా ఐశ్వర్య రాయ్, కరిష్మా కపూర్ ఇద్దరు కూడా ఒక గొప్ప చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయారు.
/p.
బాలయ్య అఖండ 2 ఎన్ని వందల కోట్లు వసూలు చేయబోతుంది..?