అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి నష్టమేంటి?: మంత్రి మేరుగ

ఏపీలో టీడీపీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో మొత్తం 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న మంత్రి మేరుగ అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు.

టీడీపీ చేసే వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని తెలిపారు.దొంగ ఓట్లతో గెలవాలన్న ఆలోచన కానీ, అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రజలకు వైసీపీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తమను అధికారంలోకి తీసుకు వస్తాయని వెల్లడించారు.

అంబానీ నుంచి జయలలిత వరకు గొప్పగా పెళ్లిళ్లు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు