పొన్నియన్ సెల్వన్ 2 స్టోరీ ఏంటంటే..?

మణిరత్నం ( Mani Ratnam )డైరెక్షన్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి.

కానీ గత ఏడాది వచ్చిన పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్( Ponniin Selvan ).

విక్రమ్ , జయం రవి , కార్తి, ఐశ్వర్య రాయ్ త్రిష వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్ర మొదటి భాగం గతేడాది విడుదలైంది.

తమిళుల నేపథ్యానికి చెందిన కథ కావడంతో కోలీవుడ్‌లో హిట్ తెచ్చుకున్న ఈ సినిమా మిగతా భాషల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్‌లో ఉండనుందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి.

"""/" / ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ ట్రైలర్‌ను విడుదల చేశారు .

అనుకున్నట్లుగానే పాత్రల మధ్య అనేక ట్విస్టులతో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యింది.ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.

అరుల్‌మొళి వర్మన్ చనిపోయాడని భావించి రాజ్యాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనలో పాండ్యులు ఉంటారు .

ఆదిత్య కరికాలుడుని కూడా చంపాలని ప్రణాళిక వేస్తారు.ఆ తర్వాత జరిగే ఊహించని మలుపుల నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ -2 సాగనున్నట్టు స్పష్టం అవుతున్నది .

స్టన్నింగ్ విజువల్స్‌కు తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది.తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడే నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) నటన ఆకర్షించింది.

అలాగే ఇతర పాత్రల నటన బాగుంది. """/" / అంతక ముందు తొలి పార్టీ లో వంచన, ద్రోహం రాజ మందిరంలోకి చొచ్చుకుని పోతున్నాయి అనే విషయాన్నీ హైలైట్ చేశారు చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు కుటుంబంలో జరిగిన పరిణామాలని ఫస్ట్ పార్ట్ లో చూపించారు .

పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడును యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు.ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను కోశాధికారి పళవేట్టురాయర్‌ ఏకం చేస్తాడు.

సుందర చోళుడు( Sundara Chola ) అన్నయ్య కుమారుడు మధురాంతకుడు ను రాజును చేయాలనేది అతని కోరిక.

రాజ్య ఆక్రమణ కోసం తెలిసినవాళ్లే కుట్ర చేస్తున్నారని గ్రహించి.ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్‌ని ఆదిత్య కరికాలన్‌ రంగంలోకి దింపుతాడు .

సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై ఎలా చెక్‌ పెట్టింది.పళవేట్టురాయల్‌ భార్య నందిని ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు చెప్పడం ఫస్ట్ పార్ట్ లో హైలైట్ అయ్యాయి .

ఇక సెకండ్ పార్ట్ లో అరుల్‌మొళి వర్మన్ చనిపోయాడని భావించిన పరినామాలని .

ఆ తర్వాత జరిగే మలుపులు ప్రధానంగా రూపొందించినట్టు స్పష్టం అవుతుంది .