ఇకపై టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయితే..?!

తాజాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో నిర్ణయాన్ని తీసుకొని వాహనదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ సంబంధించిన పరిస్థితులకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇదివరకే భారతదేశంలో ఉన్న రహదారులపై ఉండే 770 టోల్ ప్లాజా లలో ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం మార్చి 1 వరకు ఫ్రీ ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రకటించింది.

దీనివల్ల టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నేషనల్ హైవే లో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకమైన రంగుతో ఓ ప్రత్యేకమైన లైన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు రోడ్డు, రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఎప్పుడైనా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ తిరిగినట్లయితే ఓ నిర్దిష్ట సమయంలో అన్ని వాహనాల కోసం వెళ్లేందుకు ఆ కొత్త రకమైన లైన్ గేట్ పూర్తిగా తెరవాల్సి ఉంటుంది.

"""/"/ తాజాగా ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఫాస్ట్ వినియోగించే వారి సంఖ్య ఏకంగా 90 శాతానికి చేరుకోవడంతో రోడ్డు రవాణా శాఖకు పెద్ద ఎత్తున ఖజానా నిండుతోంది.

దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఈ విధానం ద్వారా 63 లక్షల లావాదేవీలతో ఏకంగా 100 కోట్ల పైగా టోల్ రుసుమును వసూలు చేసింది.

వీటితో పాటు తాజాగా కొత్తగా 25 లక్షలకు పైగా కొత్త టోల్ సేల్స్ జరిపినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది.

ఈ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం నిరీక్షించు కుండా ఉండేందుకు వీలుగా రోడ్డు రవాణా శాఖ కొత్త నిబంధన ప్రకారం ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేయనున్నారు.

 .

షర్మిల ఓడిపోతుందని బాధపడుతున్న జగన్