ధ్యానం చేసినప్పుడు శరీరంలో ఎటువంటి మార్పు వస్తుంది? శాస్త్ర‌వేత్త‌లు ఏం తేల్చారంటే..

ధ్యానం మనస్సుకు విశ్రాంతి నిస్తుంది.దాని ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది.

ధ్యానం చేసేటప్పుడు మనసులో ఎటువంటి మార్పు జరుగుతుందో అర్థం చేసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి.

సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, ధ్యానం మెదడుపై అనేక విధాలుగా ప్రభావాన్ని చూపుతుంది.

ఇది ఒక వ్యక్తిని రిలాక్స్‌గా ఉంచు తుంది.హృదయంపై ధ్యానం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కోవడానికి ఒక అధ్యయనం జరిగింది.

రెగ్యులర్ మెడిటేషన్ వల్ల పెరిగిన రక్తపోటు నార్మల్‌గా మారుతుందని పరిశోధనలో వెల్లడైంది.హైబీపీతో బాధపడే వారు ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

దీంతో పాటు కోపం కూడా తగ్గుతుంది.భావోద్వేగాలు, భయం మరియు కోపాన్ని నియంత్రించేందుకు మెదడులోని ఒక భాగం ఉందని నివేదిక చెబుతోంది.

ఒక వ్యక్తి ధ్యానం చేసినప్పుడు, ఈ భాగం చురుకుగా మారుతుంది.ఫలితంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.ధ్యానం యొక్క ప్రభావం ఉదరంపై ​​కూడా కనిపించింది.

కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులను ధ్యానం దూరం చేస్తుండని అనేక పరిశోధనలలో వెల్లడైంది.

ధ్యానం వల్ల శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.ఫలితంగా, దాని ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది.

ధ్యానం యొక్క ప్రభావం నొప్పిపై కూడా కనిపించింది.మెడిటేషన్ చేసిన తర్వాత కండరాలు రిలాక్స్ అవుతాయని నివేదిక చెబుతోంది.

ఫలితంగా నడుము నొప్పి తగ్గుతుంది.అందువల్ల, పెయిన్ కిల్లర్ల వాడకాన్ని కూడా నివారించవచ్చు.

ఇంతే కాకుండా శారీరక గాయాల విషయంలో త్వరిత రికవరీ ఉంటుందని వెల్లడయ్యింది.

వైరల్ వీడియో: వామ్మో.. వాయ్యో.. ఏంటి భయ్యా ఇది.. ఎలా ఆలోచిస్తారు ఇలా.. దోమల బ్యాట్ తో ఏకంగా..