శని బాధలు దూరమవ్వాలంటే.. ఈ రంగుల రత్నం ధరిస్తే చాలు..
TeluguStop.com
శనీశ్వరుడి దృష్టిలో తన మన అనే బేధం అసలు ఉండదు.తప్పు చేసిన ఎవరికైనా తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు.
ఇలా ఒక్కసారి శని ప్రభావం మనపై కనుక పడింది అంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వవు.దీని మూలంగా ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి.
ఇతరుల నుంచి అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే శని ప్రభావం మన పై ఉండకూడదు అంటే మనం చేసే పనులను ఎప్పుడు దృష్టిలో ఉంచుకొని మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా, ఇతరులకు అన్యాయం చేయకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.
ఇక శని ప్రభావం నుంచి బయటపడడానికి చాలామంది ఎన్నో రకాల పరిహార మార్గాలను అనుసరిస్తూ ఉంటారు.
"""/" /
ఇలా శని ప్రభావం నుంచి బయట పడాలంటే హనుమంతుడిని, ఈశ్వరుని పూజించడం వల్ల శని బాధలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు భావిస్తారు.
అంతే కాకుండా ఈ శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే చాలామంది శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలిరంగు రత్నాలను ధరించడం మనం చూస్తూనే ఉంటాం.
ఇలా నీలి రంగురత్నం ధరించడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు.ఇలా నీలి రంగు రత్నం కాస్త ఖరీదైనదిగా అయినప్పటికీ ఈ రత్నం ధరించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది.
అయితే ఈ రత్నం ధరించేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కొన్ని రకాల నియమాలను పాటించాలి.
అప్పుడే ఈ రత్నం ప్రభావం మనపై ఉంటుంది. """/" /
ఈ రత్నం ధరించిన వారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తూ ఉండాలి.
ఈ రత్నం ధరించిన వారు ఎదుటి వారికి ఎప్పుడూ సహాయం పడుతూనే ఉండాలి.
ఈ రత్నం ధరించిన వారు శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడి అనుగ్రహం మనపై ఉంటుంది.
తల్లి కాబోతున్న రకుల్ ప్రీత్ సింగ్…. అందుకే అలా చేస్తుందా?