కార్యకర్తల్ని కంటికి రెప్పల కాపాడుకుంటాం – జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోమిటిశెట్టి తిరుపతి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామానికి చెందిన కంచర్ల తిరుపతి అనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గడిచిన రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కి వీర విధేయుడుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన తిరుపతి మా నుంచి భౌతికంగా దూరమైన వారి ఆలోచనలు వారి ఆశయాలు మా మదిలో ఎప్పుడు ఉంటాయని కొని ఆడారు.

ఈ సందర్భంగా కోమిటిశెట్టి తిరుపతి వారి కుటుంబానికి 5,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

భవిష్యత్తులో పిల్లల చదువు నిమిత్తం అన్ని రకాల సహాయాలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్,రఘువీర ప్రసాద్, మంత్రి అంజయ్య, మమ్మద్, అమీర్, నాగరాజు, అస్లం, అంజయ్య, హౌస్,తదితరులు పాల్గొన్నారు.

మోకాళ్ళ‌ నొప్పులను తగ్గించే అద్భుత పానీయాలు ఇవే..!!