హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వం వెంటపడుతాం..: హరీశ్ రావు

మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

నాడు పది సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని తెలిపారు.తాము ముళ్లబాట చూశాం.

పూలబాట చూశామని పేర్కొన్నారు.కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు.

"""/" / 1.8 శాతం ఓట్లతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలిపారు.

దళితబంధు, బీసీ బంధుతో ఇబ్బంది పడ్డామన్నారు.అయితే కాంగ్రెస్( Congress ) అప్పుడు ప్రచారంలో అబద్ధాలు చెప్పిందన్న హరీశ్ రావు నేడు ప్రభుత్వంలో అసహనాలు ఉన్నాయని విమర్శించారు.

గతంలో దావోస్ దండగ అన్న వారు దావోస్ వెళ్లొచ్చారన్నారు.ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఆరు గ్యారంటీలను ( Six Guarantees )అమలు చేయండని తెలిపారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వం వెంటపడుతామని స్పష్టం చేశారు.

అజ్మల్ కసబ్‌ను గుర్తించిన ఈ పాప గుర్తుందా.. రతన్ గురించి ఏం చెప్తుందో వినండి..!