పేదల కోసం పోరాడిన చరిత్ర మాది..: డీకే అరుణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి బీజేపీ నాయకురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని డీకే అరుణ( DK Aruna ) ధ్వజమెత్తారు.

మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు.

చిట్టెం నర్సిరెడ్డి ( Chittem Narsi Reddy )గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు.

పేదల కోసం పోరాడిన చరిత్ర తమదని పేర్కొన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

జగన్ ఏడు పేజీల లేఖ .. ఎవరికి ఎందుకు ?