పేదల కోసం పోరాడిన చరిత్ర మాది..: డీకే అరుణ
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి బీజేపీ నాయకురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని డీకే అరుణ( DK Aruna ) ధ్వజమెత్తారు.
మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు.
చిట్టెం నర్సిరెడ్డి ( Chittem Narsi Reddy )గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు.
పేదల కోసం పోరాడిన చరిత్ర తమదని పేర్కొన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.
ఏపీ అప్పులు , శ్వేత పత్రాల విడుదలపై జగన్ ఏమన్నారంటే ?