నువ్వుల పంటను ఆశించే బీహారి గొంగళి పురుగులను నివారించే పద్ధతులు..!

నువ్వుల పంట( Sesame Crop )ను తక్కువ వనరులతో సాగు చేసి అధిక నికర లాభం అర్జించవచ్చు.

ఈ పంటను రెండవ పంటగా జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని సాగు చేసుకోవచ్చు.

ఈ పంటను వర్షాధారంగా ఖరీఫ్ లేదా రబీలో వర్షాధారంగా పండించవచ్చు.రెండవ పంటగా వేసవికాలంలో ( Summer )సాగు చేయవచ్చు.

తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

వేసవిలో ఆరుతడిగా సాగు చేస్తే చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది. """/" / నీరు నిల్వ ఉందని నల్ల రేగడి నేలలు, ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

నీరు నిల్వ ఉండే ఆమ్లా, క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు ఈ సాగుకు పనికిరావు.

వేసవికాలంలో నేలను రెండు లేదా మూడుసార్లు మెత్తగా దున్నుకొని, రెండుసార్లు గుంటక తోలి నేలను చదువు చేయాలి.

ఒక ఎకరం పొలానికి 2.5 కిలోల విత్తనాలు అవసరం.

ఈ విత్తనాలను మూడు గ్రాముల థైరంతో విత్తన శుద్ధి ( Seed Treatment )చేసుకోవాలి.

ఆ తర్వాత విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. """/" / ఈ పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో బీహారి గొంగళి పురుగులు( Bihari Caterpillars ) కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పురుగులను తొలిదశలోనే గుర్తించి నివారించాలి.పురుగులు గుంపులుగా ఆకులలోని పత్ర హరితాన్ని గోకితిని ఆకును జల్లెడాకుల చేస్తాయి.

ఆ తరువాత మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంద్రాలు చేస్తూ విత్తనాలను తినేస్తాయి.ఈ పురుగులు ఆశించిన చెట్లను పీకి నాశనం చేయాలి.

ఎందుకంటే ఈ పురుగులు ఆశించిన మొక్కలపై పురుగుల గుడ్లు ఉండే అవకాశం ఉంది.

ఇక ఒక లీటరు నీటిలో 2మి.లీ ఎండో సల్ఫాన్ ను కలిపి పిచికారి చేయాలి.

పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?