వీఆర్ఏ బలవన్మరణం

నల్గొండ జిల్లా:మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు(37) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పేస్కేల్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో వీఆర్‌ఏలు 47 రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక నిరసన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.

పేస్కేల్‌ అమలు కాకపోవడంతో పాటు సమ్మె కాలానికి జీతం రాకపోవడం,మరోవైపు ఆర్థిక పరిస్థితులు బాగాలేక మానసికంగా కృంగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.వీఆర్ఏ ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకుని పరామర్శించడానికి వచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావును స్థానికులు,వీఆర్ఏ అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మరణించిన వీఆర్ఏ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వీఆర్ఏ సంఘం నాయకులు,స్థానికులు కోరుతున్నారు.

హత్యాయత్నం జరిగిన స్పాట్‌కి మరోసారి ట్రంప్.. ఎలాన్ మస్క్‌తో కలిసి భారీ ర్యాలీ