కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి.. మోదీ

భోపాల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నారు.ఒకవేళ మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలని సూచించారు.

అయితే కేసీఆర్ పై ప్రధాని మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా విమర్శలు చేశారని తెలుస్తోంది.

కాగా కేసీఆర్ ను ఓడించాలన్న అర్థం వచ్చే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలున్న సంగతి తెలిసిందే.

కేసీఆర్ పై డైరెక్ట్ గా ప్రధాని మోదీ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రసవం తర్వాత తల్లి పాలను పెంచే మ్యాజికల్ డ్రింక్ ఇది.. తప్పక ట్రై చేయండి!