అనుమానాలు రేకెత్తిసున్న విష్ణుప్రియ పోస్ట్.. ఆ వ్యక్తిని కోల్పోయామంటూ?

టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో గుర్తింపు, పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న విష్ణుప్రియ ఏ షోలు చేయడం లేదు.

అయితే వెబ్ సిరీస్ లలో నటించడానికి మాత్రం విష్ణుప్రియ ఆసక్తి చూపడం లేదు.

ఇటీవల ప్రముఖ కమెడియన్లలో ఒకరైన అవినాష్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.అయితే అవినాష్ పెళ్లి తర్వాత విష్ణుప్రియ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది.

బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ గా పోవే పోరా షోతో పాటు పలు షోలకు విష్ణుప్రియ హోస్ట్ గా వ్యవహరించారు.

పలు సినిమాలలో కూడా విష్ణుప్రియ నటించినా విష్ణుప్రియకు సినిమా ఆఫర్లు ఎక్కువగా దక్కడం లేదనే సంగతి తెలిసిందే.

గ్లామరస్ సన్నివేశాల్లో నటించడానికి సైతం విష్ణుప్రియ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.సోషల్ మీడియాలో విష్ణుప్రియ షేర్ చేస్తున్న హాట్ ఫోటోల గురించి చర్చ జరుగుతోంది.

"""/"/ ముక్కు అవినాష్ పెళ్లి వేడుకకు హాజరైన విష్ణుప్రియ ఆ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

అయితే ఒక మీమ్ పేజ్ లో " ఏడాదిలో మనం లైఫ్ లాంగ్ మనతోనే ఉండాలని అనుకునే వ్యక్తులను కోల్పోయాం" అంటూ ఉన్న పోస్ట్ ను షేర్ చేస్తూ నిజమే అంటూ కామెంట్లు చేశారు.

అయితే విష్ణుప్రియ ఎవరిని కోల్పోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అవినాష్ పెళ్లి తర్వాత విష్ణుప్రియ షేర్ చేసిన ఈ పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది.

ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ సంతోష్ శోభన్ ప్రేయసిగా విష్ణుప్రియ నటించారు.

అయితే విష్ణుప్రియ స్పందిస్తే మాత్రమే ఆమె ఎవరి గురించి పోస్ట్ చేసిందో తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

విష్ణుప్రియ ఎవరి గురించి పోస్ట్ పెట్టిందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

చరిత్రలో తొలిసారి.. కెనడా బడ్జెట్ రూపకల్పనలో హిందూ సమాజానికి చోటు