వైరల్.. భర్త చితాభస్మాన్ని రెండేళ్లుగా చాక్లెట్ లా తింటున్న భార్య

ప్రేమ‌, పెళ్లి అనేవి జీవితంలో చాలా ముఖ్య‌మైన అంశాలు.ప్రేమ‌తో రెండు మ‌న‌సులు క‌లిస్తే, పెళ్లితో రెండు జీవితాలు, దాంతో పాటు రెండు కుటుంబాలు క‌లుస్తాయి.

కానీ అన్ని ప్రేమ‌క‌థ‌లు స‌క్సెస్ కావు అలాగే అన్ని పెళ్లిలు చివ‌రిదాక నిల‌వ‌వు.

కొన్ని పెళ్లిల్లు భార్యాభ‌ర్త‌ల మధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల క‌డ‌దాక సాగ‌క‌పోతే, మ‌రి కొన్ని పెళ్లిల‌లో భార్యా భ‌ర్త‌ల్లో ఎవ‌రో అర్ధాంత‌రంగా కాలం చేయ‌డం వ‌ల్ల చివ‌రి వ‌ర‌కు సాగ‌వు.

దంప‌తుల మ‌ధ్య అనోన్య‌బంధం ఎలా ఉంటుందంటే.జీవిత భాగ‌స్వామి ప‌క్క‌న త‌న‌తో లేక‌పోయినా ఉన్న‌ట్టే భావిస్తారు.

వారే పిలిచిన‌ట్టు భావించి ప‌లుకుతుంటారు.దానినే మ‌నం భ్ర‌మ అంటాం.

కానీ కొంద‌రికి అది పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవ‌డం వ‌ల్ల దానిని భ్ర‌మ అని అనుకోరు.

వారు నిజంగా త‌మ ప‌క్క‌నే ఉన్నార‌ని భావిస్తారు.అలాంటి వారికి మాన‌సిక చికిత్స అస‌వ‌రం.

ఇలాంటి ఘ‌ట‌నే ఓ చోట జ‌రిగింది.బ్రిటన్ కు చెందిన కాసీ అనే మహిళకు 26 ఏళ్లు.

ఆమెకు 2009లో సీన్ అనే కుర్రాడితో పెళ్లి జరిగింది.కానీ దురద్రుష్టవశాత్తు అతను పెళ్లైన రెండు సంవత్సరాలకే ఆస్తమాతో మరణించాడు.

భర్త అంతక్రియలు చేసిన తరువాత తన వెంట ఆ బూడిద తెచ్చుంది కాసీ.

"""/"/భర్త అంటే ఎంతో ఇష్టమైన కాసీ.ఎక్కడికి వెళ్లినా ఇప్పుడూ ఆ చితాభస్మాన్ని తీసుకెళ్తోంది.

దానిని చాక్లెట్ లా తింటూ ఎంజాయ్ చేస్తోంది.ఇలా చేస్తే ఎప్పుడూ సీన్ తన వెంట ఉన్నాడనే భావన కలుగుతుందని చెబుతున్నారు కాసీ.

ఈ విషయాన్ని ‘ మై స్ట్రేంజ్ అడిక్ట్’ అనే కార్యక్రమం ద్వారా తనే ప్రపంచానికి తెలియజేసింది.

అయితే ఇదేం పిచ్చి ప్రేమరా బాబోయ్ అని నెటింట్లో కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి.

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. హీరోయిన్ స్నేహ షాకింగ్ కామెంట్స్ వైరల్!