వైరల్ వీడియో.... ఈయన నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుం భిస్తుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం.

మంత్రుల మొదలు, సామాన్యులకు కరోనా సోకుతూ బెంబేలెత్తిస్తోo ది.అయితే రోజుకు లక్షల మించి కరోనా కేసులు నమోదవుతుండడంతో ఎక్కువగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలు అవుతున్న పరిస్థితి ఉంది.

మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఏకంగా జనతా కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.అయితే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ప్రజలు ఆ మాత్రం ఆ నిబంధనలను గాలికి వదిలేస్తున్న పరిస్థితి ఉంది.

యథేచ్ఛగా బండ్లపై సంచరిస్తూ కోవిడ్ మరింత వ్యాపించడానికి కారణమవుతున్నారు.లాక్ డౌన్ అంటే ఇక పోలీసులు లాక్ డౌన్ ఎలా అమలవుతున్నదని పరిశీలిస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు.

అయితే ఇక ఆ సమయంలో పట్టుబడ్డ వ్యక్తులు చేసే కొన్ని చేష్టలు నవ్వులు పూయిస్తాయి.

అచ్చం ఇలానే జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది.బైక్ పై ముగ్గురు వెళ్తుండగా పోలీస్ సైరన్ విని పోలీస్ వ్యాన్ రాకముందు బండి పై నుండి ఇద్దరు దూకి, ఒక వ్యక్తి పారిపోగా ఇంకో వ్యక్తి తనకేమీ తెలియనట్టు తన జేబులో ఉన్న మాస్క్ ధరించి ఏకంగా పోలీసులతోనే మంత నాలు జరుపుతాడు.

అప్పుడు ఈ వ్యక్తిని అంతగా గుర్తు పట్టని పోలీసులు తరువాత సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్ని చూసి ఖంగుతిన్నారని చెప్పవచ్చు.

ఇక ఆ వ్యక్తి చేసిన ఆస్కార్ నటనను చూసిన నెటిజన్లు ఇతనికి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక తరువాత పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసారు.మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు