వైరల్: బైక్ నడుపుతూ రాలిపోయిన యువకుడు... తగిన శాస్తి చేసిన పోలీసులు!

నేటితరం కొత్తపోకడలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.పెద్దాళ్ల మాటలు పెడచెవిన పెడుతున్నారు.

అమ్మాయి కనబడితే చాలు కొందరు యువత రోడ్ల మీద అడ్డమైన స్టంట్ లు వేస్తు బైక్ ను నడిపిస్తుంటారు.

ఒక చేత్తో వెహికిల్ నడిపించడం, స్టీరింగ్ వదిలేయండం వంటివి ఇందులో భాగంగా చేస్తుంటారు.

మరికొన్ని చోట్ల ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో వెళ్లడం, ఎక్కువ మందిని ఎక్కించుకోవడం చేస్తుంటారు.

మరికొందరు తాగి వెహికిల్స్ నడిపిస్తుంటారు.ట్రాఫిక్ నియమాలను పాటించమంటే అసలు పట్టించుకోరు.

కనీసం హెల్మెట్ కూడాపెట్టుకొరు.కొందరు బైక్ మీద చేసే వెకిలి చేష్టల వలన కొన్నిసార్లు ఎదుటివారు ప్రమాదాల బారిన పడుతుంటారు.

మరికొన్ని సార్లు.వారే ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.

ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.పూర్తివివరాలు.

ఛత్తీస్ గఢ్ కు చెందిన యువకుడు బైక్ మీద వేసిన స్టండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యువకుడు బైక్ మీదకూర్చుని ఒక చేత్తో వెహికిల్ ను కంట్రోల్ చేస్తు మరోచేతితో వెహికిల్ ను నడిపిస్తున్నాడు.

అతను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు.పైగా స్పీడ్ గా డెంజరేస్ గా వెళ్తున్నాడు.

అతని చుట్టుపక్కల మరికొన్ని వెహికిల్స్ కూడా రోడ్డుపైన వెళ్తున్నాయి.దాంతో వారు ఇతడిని వింతగా చూస్తున్నారు.

ఇక ఈ తంతంగా ట్రాఫిక్ పోలీసులు చూసారు.దాంతో ఇతగాడిని పట్టుకున్నారు.

వెంటనే స్టేషన్ కు తీసుకెళ్తారు.అక్కడ రాంగ్ రూట్, స్టంట్ లు వేసినందుకు ఫైన్ వేశారు.

గుంజీలు కూడా తీయించారు.ఆ తర్వాత.

పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతాలతో పోస్ట్ చేశారు.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అందుకే నేటి పిల్లలను తెల్లిదండ్రులు కాస్త మచ్చిక చేసుకొని ప్రతిదీ అర్ధమైనట్టు చెప్పాలి.

లేదంటే భవిష్యత్ తరాలు ఆగమాగం అయిపోతాయి.

బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మకు అలాంటి మెసేజ్ లు.. అతని అమ్మను ఇలా అంటే పరవాలేదా అంటూ?