వైరల్: స్విమ్మింగ్ పూల్ లో ఎంట్రీ ఇచ్చిన మొసలి పిల్ల.. ఏం జరిగిందంటే?

నేటి యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు.మరీ ముఖ్యంగా కరోనా తరువాత ప్రజలకు ఆరోగ్యం విషయమై పలు నియమాలు పాటిస్తున్నారు.

ఈ క్రమంలోనే వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ అనేదానిని తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారు.

అవును, ఇక్కడ చాలామంది ఉదయాన్నే స్విమ్మింగ్ చేయడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నారు.ఎందుకంటే దాని వలన లాభాలు అనేకం కనుక.

ఈ నేపధ్యంలోనే ముంబైలోని( Mumbai ) ఓ స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది కుర్రాళ్ళు చాలా ఉత్సాహంగా ఈత కొడుతుండగా అనుకోకుండా ఓ మొసలి పిల్ల( Baby Crocodile ) వారి కంట పడింది.

ఇక అంతే, వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఒక్క ఉదుqటున వారు పరుగులంకించారు.

"""/" / అక్కడ దాదర్‌లోని సెంట్రల్ సబర్బ్‌లో( Central Suburb Of Dadar ) ముంబై పౌర సంస్థ బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంటున్నట్టు సమాచారం.

కాగా మహాత్మా గాంధీ జలతరణ్ తలావో( Mahatma Gandhi Jalataran Talao ) అనే ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌ను సభ్యుల కోసం తెరవడానికి ముందు.

అంటే అక్టోబర్ 3న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు ఆ మొసలి పిల్లను గమనించి అధికారులకు చెప్పారు.

"""/" / తరువాత ఈ విషయంపై సమాచారం అందుకున్న వారు నిపుణల సహాయంతో మొసలి పిల్లను క్షేమంగా ఒడ్డికి చేర్చినట్టు అధికారులు తెలిపారు.

ఆ తరువాత మొసలి పిల్లను సహజ ఆవాసాలలోకి విడిచిపెట్టడానికి అటవీ శాఖకు అప్పగిస్తున్నట్లు బీఎంసీ తెలిపింది.

అయితే స్విమ్మింగ్ పూల్‌లో మొసలి ఎలా చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని.దర్యాప్తు ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని.ప్రైవేట్‌ జూలోని పాములు రోడ్లపైకి రావడంతో ప్రజలను భయాందోళనకు గురయ్యాని చెబుతున్నారు.

ఏఐ వాడి సమంతను టార్గెట్ చేశారుగా.. అలాంటి వీడియో నెట్టింట వైరల్!