వైరల్: ప్రేయసి కోసం ఖర్చు చేసిన డబ్బులు వసూల్‌ చేయాలని సూసైడ్ లెటర్‌!

సాధారణంగా చనిపోయే వారు తమ సూసైడ్ లెటర్‌లో చాలా ముఖ్యమైన విషయాలను రాస్తుంటారు.

తమ చావుకి కారణం ఎవరనేది లేక ఇంకేదైనా కారణాలను వివరిస్తారు.అయితే తాజాగా ఒక ప్రియుడు మాత్రం తాను ఇప్పటివరకు తన ప్రియురాలి కోసం ఖర్చు చేసిన లెక్కలను రాశాడు.

తాను తన ప్రేయసి సరదాల కోసం రూ.4.

50 లక్షలు ఖర్చు చేశానని.ఆ డబ్బంతా ఆమె నుంచి వసూలు చేసి తన ఫ్యామిలీ ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరాడు.

మృతదేహం పక్కనే ఈ లెటర్ కనిపించింది.ఇది చదివిన పోలీసులు షాక్ అయ్యారు.

ఇప్పుడు ఈ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.వివరాల్లోకి వెళితే.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాకి చెందిన చేతన్‌ (31) తొమ్మిదేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు.

సరుకు రవాణా వాహనానికి డ్రైవర్‌గా పనిచేసే ఇతను తనకు వచ్చిన సంపాదన మొత్తం ఈమె కోసమే ఖర్చు చేశాడట.

ఈమె సరదాలు తీర్చేందుకు అతను తొమ్మిదేళ్ల కాలంలో ఏకంగా నాలుగున్నర లక్షలు ఖర్చు చేశాడట.

అయితే ఇంత మొత్తంలో ఖర్చు చేసినా ఆమె పెళ్లి విషయానికి వచ్చేసరికి ముఖం చాటేసింది.

దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.తన ప్రియురాలి సంతోషాలకోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని ఫ్రెండ్స్ ముందు కూడా వాపోయాడట.

వారు కూడా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.అయితే ప్రియురాలు తనని బాగా వాడుకొని వదిలేసిందని.

తన ప్రేమకు అసలు వ్యాల్యూ ఇవ్వలేదని కృంగిపోయిన చేతన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.

సోమవారం అతడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. """/" / ఈ విషయం గురించి చైతన్‌ ఫ్రెండ్స్ పోలీసులకు తెలియజేశారు.

అయితే మృతదేహం పక్కనే ఉన్న లెటర్ చదివిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు.

చనిపోతూనే ఆమెకు సరైన గుణపాఠం నేర్పావ్ భయ్యా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మూడేళ్ల క్రితమే పవన్ సీఎం అవుతారని చెప్పానన్న ఎస్జే సూర్య.. సగం మాత్రమే ప్రూవ్ అయిందంటూ?