వైరల్ పిక్.. కాబూల్ను విడిచి విమానం ఎక్కుతున్న అమెరికా చివరి సైనికుడు
TeluguStop.com
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న దారుణాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయనే చెప్పాలి.కాగా ఇంత జరుగుతున్నా కూడా అక్కడ మాత్రం కనీసం పోరాట పఠిమ కనిపించట్లేదు.
అసలు ఇదంతా జరగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా తన బలగాలను వెనక్కు రప్పించుకోవడమనే చెప్పాలి.
గత 20 ఏండ్లుగా జరిగిన యుద్ధాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పోరు ముగించుకుంది.
మొన్నటి వరకు తమ ఆధిపత్యంలోనే ప్రభుత్వాన్ని కొనసాగించిన అమెరికా ఇప్పుడు తన బలగాలను వెనక్కు రప్పించడంలో మునిగిపోయింది.
దీంతో ఇప్పుడు ఆ దేశం నుంచి తమ బలగాలను వెనక్కు రప్పిస్తూ మూటా ముల్లె సర్దేసింది అమెరికా.
తాము విధంచిన గడువు కంటే కూడా ఒక్కరోజు ముందే అమెరికా ఆ దేశాన్ని విడిచిందనే చెప్పాలి.
చివరి విడతలో భాగంగా మిగిలిపోయిన సైనికులను అమెరికా యుద్ధవిమానాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాయి.
దీంతో ఇప్పుడు ఆ దేశంలో తాలిబాన్ల రాక్షస పాలనకు అడ్డు అదుపు లేకుండా డా పోయాయి.
కాగా ఈ విధంగా అమెరికా సైనిక బలగాలు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి వెళ్తున్న సమయంలలో కెమెరాలకు ఓ ఫొటో చిక్కింది.
ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతంఓది.అయితే అతను ఆఫ్ఘనిస్తాన్ వీడుతున్న అమెరికా సైనికుడు.
ఆయన చీకట్లో నడుస్తూ విమానం ఎక్కేందుకు వస్తున్న క్రమంలో ఆయన ఫొటోను అక్కడున్న వారు తీయడంతో అది వైరల్ అవుతోంది.
ఎందుకంటే ఆయన మేజర్ జనరల్ క్రిస్ డోనాహు.ఇప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ను వీడిన సైన్యంలో చిట్ట చివరి వ్యక్తి కావడం విశేషం.
ఆఫ్ఘాన్ ను వీడిన చివరి అమెరిఆ సైనికుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు.ఇప్పుడు ఆయన ఫొటో విపరీతంగా వైరల్ కావడం గమనార్హం.
మరి మీరు కూడా ఆ సైనికుడి ఫొటోను చూసేయండి.
ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదా… సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య