దేవాలయ ప్రతిష్టకు మంత్రిని ఆహ్వానించిన నారాయణపూర్ గ్రామస్తులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఫిబ్రవరి 22వ తేదీన జరిగే హనుమాన్ దేవాలయ ప్రతిష్టకు మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంగళవారం హైదరాబాదులో కలిసి ఆహ్వానించారు.

అలాగే రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణ చారిని కూడా ఆహ్వానించారు.పురాతన హనుమాన్ దేవాలయాన్ని పునర్నిర్మానం చేయడం పూర్తయింది.

ఈ నెలలో 20 21 22 తేదీలలో ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను దేవాదాయశాఖ రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణాచారి తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.

కలిసిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, రామాలయ కమిటీ చైర్మన్ సూర నర్సయ్య,మాజీ ఉపసర్పంచ్ మహేందర్, నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి,లింగాల నరసయ్య ఉన్నారు.

ఓరి నాయనో.. ఈ అవ్వ మజిల్స్ చూస్తే మతిపోతుంది..?