గాంధీజీ చెప్పినట్లుగానే గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యత..: సీఎం కేసీఆర్

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గతేడాది వజ్రోత్సవాలను 15 రోజులపాటు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు.

బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం యావత్ ప్రపంచ చరిత్రలోనే మహోన్నత పోరాటంగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ లాంటి అనేక మంది వీరుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.

సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు.గొప్ప నాయకుల్లో గాంధీ అగ్రగన్యులని తెలిపారు.

అయితే చివరకు మతోన్మాదుల చేతిలో గాంధీ హత్యకు గురికావడం బాధాకరమన్నారు.గాంధీ చూపిన అహింసా పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని చెప్పారు.

గాంధీజీ చెప్పినట్లుగానే గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.తెలంగాణలోని సంక్షేమ పథకాలపై గాంధీజీ ప్రభావం ఎంతో ఉందన్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

లైవ్ కాన్సర్ట్‌లో అమ్మాయిలకు లిప్ కిస్సులు ఇచ్చిన ఉదిత్ నారాయణ్.. వీడియో వైరల్!