మనం సీక్వల్ ప్లాన్ చేస్తున్న విక్రమ్ కె కుమార్

మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని ఒక సినిమాని అలాగే టాలీవుడ్ లో కూడా ఓకే బ్లాక్ బస్టర్ మూవీ అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్.

ఈ సినిమా తర్వాత విక్రమ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.తరువాత తమిళంలో సూర్యతో 24 సినిమా చేసి హిట్ కొట్టాడు.

అయితే మనం లాంటి బ్లాక్ బస్టర్ అక్కినేని ఫ్యామిలీకి అందించిన విక్రమ్ అఖిల్ కి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు.

అఖిల్ రెండో సినిమాగా వచ్చిన హలొ మూవీ ఒక మోస్తారుగా ఏవరేజ్ టాక్ తో బయటపడింది.

ప్రస్తుతం ఈ దర్శకుడు నాగ చైతన్యతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో థాంక్యూ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమా తర్వాత మళ్ళీ విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీ హీరోలతోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మనం తరహాలోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని విక్రమ్ కుమార్ సిద్ధం చేశాడని దీనిని రీసెంట్ గా నాగార్జునకి కూడా వినిపించడం జరిగిందని టాక్ నడుస్తుంది.

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, చైతన్య, అఖిల్, సమంతలతో పాటు అమల, సుమంత్, సుశాంత్ లని కూడా భాగం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ కథకి సంబందించిన స్టోరీ లైన్ కి కింగ్ నాగార్జున కూడా ఒకే చెప్పాడని కథ మొత్తం సిద్ధం చేసిన తర్వాత చూద్దామని విక్రమ్ కె కుమార్ కి మాట ఇచ్చినట్లు బోగట్టా.

ప్రస్తుతం విక్రమ్ కుమార్ చైతన్యతో చేస్తున్న థాంక్యూ సినిమాతో సూపర్ అక్కినేని ఫ్యామిలీకి మరో సూపర్ హిట్ అందిస్తే నాగార్జున కచ్చితంగా అతను చెప్పిన మనం సీక్వల్ కి ఒకే చెప్పే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

చింత‌పండు జ్యూస్‌తో మ‌తిపోయే ఆరోగ్య లాభాలు.. అవేంటో తెలిస్తే రోజూ తాగేస్తారు!