చంద్రబాబు మళ్లీ వెక్కివెక్కి ఏడుస్తారు అంటున్న విజయసాయిరెడ్డి..!!

వైసీపీ ప్లీనరీ సమావేశానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్లీనరీ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు.పాస్ లు వంటి విషయాల గురించి తెలియజేశారు.

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.వైసీపీ ప్లీనరీ ఘన విజయం తర్వాత.

చంద్రబాబు మళ్ళీ వెక్కివెక్కి ఏడుస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.ముందస్తు ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అవుదామని చంద్రబాబు కలలు కంటున్నారు.

అయితే ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి.వైసీపీ అధికారంలోకి వచ్చాక ₹1.

40 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయి.వీటిని ప్లీనరీ సమావేశంలో తెలియజేస్తాం అంటూ తనదైన శైలిలో విజయసాయిరెడ్డి తెలియజేశారు.

 జులై 8 వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా.జరుగుతున్న ఈ ప్లీనరీ సమావేశంకి రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారు.

పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం జరుగుతూ ఉండటంతో.అధ్యక్షుడు జగన్ ప్రసంగం గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కూతురి వల్లే బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్.. బాలయ్య చిన్నల్లుడు చెప్పిన సీక్రెట్స్ ఇవే!