కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
అక్టోబర్ 17వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ అధ్యక్షులు ఎన్నికలలో మొట్టమొదటిసారి గాంధీయేతర కుటుంబ సభ్యులు పోటీ పడుతూ ఉన్నారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఇటువంటి తరుణంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సెటైర్లు వేశారు.
"""/" /
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీని నడిపే అవగాహన వచ్చేవరకు తాత్కాలికంగా ఓ వ్యక్తి కుర్చీలో కూర్చోవడానికి అధ్యక్ష ఎన్నికలు అని డ్రామాలాడుతున్నారని అభివర్ణించారు.
ఏ పార్టీకి కూడా రెండు భిన్నమైన కేంద్రాలు ఉండవని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తెలుగువాడైన పీవీ నరసింహారావు పట్ల వ్యవహరించిన తీరు తెలుగు ప్రజలు మర్చిపోలేరని వ్యాఖ్యానించారు.
దీంతో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్న గాని ప్రధానంగా అశోక్ గెహ్లాట్- శశిధరూర్ మధ్య.
పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ