వేదింపులతో ఆత్మహత్యకు యత్నించిన నటి

సెలబ్రెటీలకు సోషల్‌ మీడియాలో వేదింపులు అనేవి కామన్‌గా ఎదురవుతూనే ఉంటాయి.కొందరు యాంటీ ఫ్యాన్స్‌ లేదంటే కొందరు సోషల్‌ మీడియా ఫేమస్‌ అవ్వడానికి సెలబ్రెటీలను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇప్పుడు నటి విజయలక్ష్మి తనకు సోషల్‌ మీడియాలో వేదింపులు ఎక్కువ అవుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఆత్మహత్యకు పాల్పడినది.

ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతోంది.తమిళ నటి విజయలక్ష్మిని గత కొంత కాలంగా రాజకీయ నాయకుడు అయిన సీమన్‌ మరియు హరిలు సోషల్‌ మీడియాలో వేదిస్తున్నారని, వారి ఫాలోవర్స్‌ కూడా చాలా మంది నన్ను నెట్టింట టార్గెట్‌ చేసి వేదిస్తున్నారు.

నాలుగు నెలలుగా వారి వేదింపులు ఎక్కువ అయ్యాయి.నేను నా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నాము.

వారి వల్ల నేను డిప్రెషన్‌కు వెళ్లి పోయాను.గతంలో వారి గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తావించి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మళ్లీ లైవ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.

లైవ్‌లోనే మరోసారి వారిపై ఆరోపణలు చేస్తూ బీపీ ట్యాబ్లెట్స్‌ ఎక్కువగా వేసుకుంది.తాను బీపీ డౌన్‌ అయ్యి మృతి చెందబోతున్నట్లుగా పేర్కొంది.

ఫేస్‌ బుక్‌లో ఇదే నా చివరి వీడియో అంటూ ఆమె చేసిన పోస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

ఆమె ట్యాబ్లెట్స్‌ వేసుకున్న వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు అన్నారు.

పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి వారిని విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఎవరు ఈ ఇందు రెబెకా వర్గీస్..? సాయి పల్లవి ఒప్పుకుందంటే విషయం ఉండే ఉంటుంది !