వారిసు ఓటీటీ రైట్స్ ఎవరు కొన్నారంటే..!

దళపతి విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా వారిసు.

ఈ సినిమాను తెలుగులో వారసుడుగా రిలీజ్ అవుతుంది.తమిళ్ వర్షన్ నేడు రిలీజ్ కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాగా ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది.

సినిమా ఓటీటీ డీల్ ని అమేజాన్ ప్రైం తో సెట్ చేసుకున్నారట.వారిసు సినిమాను అమేజాన్ ప్రైం వారు భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

"""/"/ విజయ్ కు ఉన్న కోలీవుడ్ ఫాలోయింగ్ ని దృష్టి లో పెట్టుకుని అమేజాన్ ప్రైం వారు వారిసు రైట్స్ కొనేశారట.

ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజైన అజిత్ తునివు సినిమాను మాత్రం నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.

వారిసు అమేజాన్ ప్రైం, తునివు నెట్ ఫ్లిక్స్ రెండు సినిమాలకు భారీ ప్రైజ్ ఆఫర్ చేశారట.

సో థియేట్రికల్ రన్ మాత్రమే కాదు ఈ రెండు సినిమాలు ఓటీటీ డీల్స్ కూడా అదిరిపోయాయని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి కాబట్టి ఓటీటీలో కూడా సూపర్ హిట్ అవుతాయని చెప్పొచ్చు.

ఆఫ్రికన్ అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న సింహం.. క్లోజ్-అప్ షాట్ చూస్తే?