లైగర్ పరువు గంగ పాలు.. రెండు వారాల క్రితం విడుదలైన సినిమాకే ఎక్కువ!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దాదాపు రూ.100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఉత్తర భారతం లో మంచి హైప్ ని క్రియేట్ చేసింది.

హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ అనన్య పాండే దాదాపు నెల రోజుల పాటు ముంబై మరియు ఇతర ఉత్తర భారతం లో సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేశారు.

ఎంత భారీ గా ప్రమోట్ చేసిన కూడా సినిమా లో మ్యాటర్ లేకపోతే పరిస్థితి ఏంటి అనేది గతం లో వచ్చిన పలు సినిమాలు నిరూపించాయి.

అదే ఇప్పుడు లైగర్ సినిమా కు కూడా జరిగింది.బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

మూడు వారాల క్రితం విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 సినిమా సాధించిన వసూళ్ల కంటే కూడా లైగర్ సాధించిన రెండవ రోజు వసూళ్లు దారుణంగా ఉన్నాయంటూ సినీ వర్గాల వారు చెప్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తర భారతంలో శనివారం ఒక్క రోజే కార్తికేయ 2 సినిమా సాధించిన వసూలతో పోలిస్తే లైగర్ సినిమా వసూలు చాలా తక్కువగా ఉన్నాయట.

అంటే పరిస్థితి ఏ రేంజ్ లో దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఏ మాత్రం ప్రమోషన్ లేకుండా విడుదలైన కార్తికేయ 2 సినిమా సాధిస్తున్న వసూళ్లలో కనీసం సగం అయినా విజయ్ దేవరకొండ సినిమా సాధిస్తుందా అంటే అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది విజయ్ దేవరకొండ కు చాలా పెద్ద అవమానకర సంఘటన అంటూ ఆయన అభిమానులు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్ పై పూర్తి నమ్మకం పెట్టిన విజయ్ దేవరకొండ తప్పు చేశాడు అంటూ కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా ఫ్లాప్ కి కారణం హిందీ నిర్మాత కరణ్ జోహార్ అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు, మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడడం తో ఆయన అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

వెంకటేష్ అనిల్ రావిపూడి తో మళ్ళీ రోటీన్ సినిమానే చేస్తున్నాడా..?