రౌడీ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు ప్రారంభం కాబోతుందట

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఆ సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది కాలం అవ్వబోతుంది.అయినా కూడా ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ తదుపరి సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించక పోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కారణం సమంత అనే విషయం తెలిసిందే.శివ నిర్మాణ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమా రూపొందుతుంది.

ఆ సినిమా చిత్రీకరణ సగం లో ఉండగా సమంత అనారోగ్య సమస్యలకు గురి అయింది.

అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగి పోయింది.

సమంత ఎప్పుడు షూటింగ్ కి జాయిన్ అవుతుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డిసెంబర్ నెలలో సమంత మీడియా ముందుకు వచ్చింది.కచ్చితంగా జనవరిలో చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా ఆమె పేర్కొంది, కానీ జనవరి నెల పూర్తి కాబోతున్న ఇప్పటి వరకు సమంత చిత్రీకరణలో పాల్గొనలేదు.

"""/"/ సమంత నుండి మళ్ళీ క్లారిటీ వచ్చింది.ఫిబ్రవరి నుండి సమంత హీరోయిన్ గా వరస సినిమా లో నటించబోతుందట.

విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆమె ఫిబ్రవరిలో 12 నుండి 15 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ రెండు వారాల్లో విజయ్ దేవరకొండ సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నారు.

సమంత గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించడం లేదు.అందుకే ఆమెకు తగ్గట్లుగా కాస్త లైట్ సన్నివేశాలను ఫిబ్రవరి షెడ్యూల్లో చేయబోతున్నారట.

మార్చి లో మరో రెండు వారాల డేట్స్ సమంత ఇస్తే చిత్రీకరణ మొత్తం పూర్తి చేస్తాం అంటూ దర్శకుడు శివ నిర్వాన చెప్తున్నాడు.

మార్చి లో సినిమా పూర్తి అయితే సమ్మర్ కానుకగా విజయ్ దేవరకొండ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‭కు గుడ్ బై చెప్పిన శిఖ‌ర్ ధావ‌న్.. (వీడియో)