ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న విజయ్ -పూరి జనగణమన!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న లైగర్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది.ఇక ఈ సినిమాని ఆగస్ట్ 25 వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎన్నో సంవత్సరాల నుంచి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉండిపోయిన జనగణమన సినిమాని విజయ్ దేవరకొండతో చేయాలని పూరిజగన్నాథ్ భావించినట్లు మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రకటించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులపై శ్రద్ధ పెట్టారు.

దాదాపు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి కావచ్చని తెలుస్తోంది.ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి ఈ సినిమాని ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి తీసుకురావాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఏప్రిల్ నెలలో మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ఇక ఈ సినిమా మేజర్ షూటింగ్ కోసం అమెరికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.

పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ ఈ పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు.

 అయితే ఈ సినిమా గురించి మిగిలిన సమాచారం త్వరలోనే చిత్రబృందం అధికారకంగా తెలియజేయనునట్లు తెలుస్తోంది.

నాని సుజీత్ కాంబినేషన్ మూవీ ఆగిపోవడం వెనుక సమస్య ఇదే.. అందుకే ఆగిపోయిందా?