నయనతార పిల్లల క్యూట్ ఫోటోలను షేర్ చేసిన విఘ్నేష్..కానీ అలా?

దక్షనాది సినీ ఇండ్ట్రీలో నటిగా, లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి నయనతార(Nayanatara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

ఇలా ఈమె డైరెక్టర్ విగ్నేశ్ శివన్ (Vignesh Shivan) ను కొంత కాలంగా ప్రేమిస్తూ పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు ( Twin Children )తల్లిదండ్రులు అయ్యారు.

ఈ జంట తమ కుమారులకు ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరిచారు.

ఈక్రమంలో.తమ కొడుకులకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది.

"""/" / ఇలా పిల్లలు పుట్టిన తరువాత ఈ జంట తరచూ తన పిల్లల ఫోటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నప్పటికీ వారి మొహం కనపడకుండా జాగ్రత్త పడేవారు.

అయితే తాజాగా.డైరెక్టర్ విగ్నేష్ శివన్ మరోసారి తన పిల్లలు నయనతారతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందులో కూడా తన పిల్లల ముఖాలు కనిపించకుండా.వారి చిన్న చిన్న చేతుల క్యూట్ పిక్ ను మాత్రమే షేర్ చేశాడు.

"""/" / ఆనందం మన ప్రియమైనవారిలో జరిగే ప్రతిదానితో ముడిపడి ఉంటుంది! ప్రేమ అనేది ఆనందం, ఆనందమే ప్రేమ.

అన్నింటికి మించి మీరు కలిగి ఉండే ప్రేమే.మీకు ఆశీర్వాదం అంటూ.

తన పోస్ట్ కు ట్యాగ్ లైన్ రాశారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతో మంది పిల్ల మొహాలు ఎప్పుడు చూపిస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక నయనతార ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ మరో వైపు తన సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈమె షారుక్ నటిస్తున్న జవాన్(Jawan) సినిమాలో నటిస్తున్నారు.

కొండ సురేఖ వివాదం .. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపం