వీడియో వైరల్: ఏసీ కోచ్లో విషపూరిత పాము..
TeluguStop.com
రైలుకు సంబంధించి ప్రమాదాల గురించి చాలా మంది వినే ఉంటాము.రైలులో దోపిడీ గురించి కూడా వినే ఉంటాము.
కానీ., రైలులో పాము ఉండడం అనే సంఘటన అరుదైనదిగా అని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుండి ముంబైకి వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలులో( Garib Rath Express Train ) విషపూరిత పాము కనిపించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
జబల్పూర్ - ముంబై ( Jabalpur - Mumbai )గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏసీ కోచ్లో పాము సంచరించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
"""/" / ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియో ప్రకారం, ఆ విషపూరితమైన సీట్ల మధ్య హ్యాండిల్స్పై తిరుగుతూ కనిపించింది.
ఆ పాము కోచ్లోని ఏసీ డక్ట్కు( Snake To AC Duct In Coach ) చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.
సమాచారం ప్రకారం, రైలు కసర రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే, కోచ్ G3 లో ఎగువ బెర్త్ (23) పై పాము కనిపించింది.
పాము కనిపించగానే బెర్త్పై కూర్చున్న ప్రయాణికుడు శబ్దం చేయడం ప్రారంభించాడు. """/" / అనంతరం కోచ్లో గందరగోళం నెలకొంది.
ప్రయాణీకులలో ఒకరు వెంటనే పాము వీడియోను రికార్డ్ చేశారు.ఆ వీడియో కాస్తాయా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కొద్దిసేపటికే వైరల్గా మారింది.
ప్రయాణికులు వెంటనే రైలు సిబ్బందికి సమాచారం అందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.అందిన సమాచారం మేరకు కోచ్లో పాము కనిపించడంతో, ప్రయాణికులను మరొక కోచ్కు తరలించి ఆ కోచ్కు తాళం వేసి ఉంచారు.
గతంలో రైలులో నీటి లీకేజీలు వచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ, పాము ఎక్కిన ఘటన ఇప్పుడు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
అదృష్టవశాత్తూ, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.పామును సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరిగాయి.