‘వెయ్యినొక్క జిల్లాల వరకు’ తన కీర్తిని పెంచుకున్న మాస్ రాజా!

మాస్ మహారాజా రవితేజ (Raviteja)హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ 'రావణాసుర' (Ravanasura).

అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే రవితేజ గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఇదే స్థాయిలో హిట్ అవుతుంది అని ఆశగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

రవితేజ నుండి ఏప్రిల్ లో మరో మూవీ రాబోతుంది.అందుకే ఫ్యాన్స్ అలర్ట్ గా ఉన్నారు.

మరి ముందుగా రవితేజ తన లైనప్ లో ఉన్న రావణాసుర తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా నిన్న ఈ సినిమా నుండి మరొక పాటను రిలీజ్ చేసారు.

"""/" / వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే అంటూ సాగే ఈ సింగ్ వెంకటేష్ సినిమాలోని సూర్య ఐపీఎస్ లో పాటకు రీమిక్స్ గా రెడీ చేసి రవితేజ, మేఘ ఆకాష్( Megha Akash ) మీద చిత్రీకరించారు.

ఈ సాంగ్ లో ఇద్దరు కూడా మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నారు.ఈ సాంగ్ టాప్ లో ట్రెండ్ అవుతుంది.

కులకర్ణి ఆలపించిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసారు. """/" / ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.

హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.

ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

ఆనంద్ మహీంద్రా ఎందుకు ఆ పాత భవంతిలోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..?