వేణు మాధవ్ చివరి రోజుల్లో ఎలా ఉన్నాడో తెలుసా?

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో వేణు మాధవ్ నటించాడు.2000 సమయంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో వేణు మాధవ్ కమెడియన్ పాత్రల్లో నటించి పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు.

హాస్య నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్న వేణు మాధవ్ 2014లోనే కోదాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.

కానీ అది కుదరలేదు.దీంతో 2018 ఎన్నికల్లో కూడా ఆయన కోదాడ నుంచి పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడ దాఖలు చేశారు.

కానీ చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణంలో అయన నాలుగు వందలకుపైగా సినిమాల్లో నటించాడు.

అలాంటి వేణు మాధవ్ చాలా ఏళ్లపాటు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు.కొన్ని రోజుల పాటు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన అయన గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన మృతిచెందారు.

అయితే వేణుమాధవ్ చనిపోకముందే కొన్ని ఛానెల్స్ లో, కొన్ని వెబ్ సైట్స్ లో వేణు మాధవ్ మృతి చెందినట్టు వార్తలు వచ్చి అతన్ని తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.

వేణుమాధవ్ చనిపోయే చివరి రోజుల్లో సినీ నటుడు రాజశేఖర్ వేణు మాధవ్ ని కలిశారు.

ఆ సమయంలో వారు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నిజానికి ఆ ఫోటోలలో వేణు మాధవ్ మన కమెడియన్ ల లేనే లేరు.

అంతేకాదు సినీ నటుడు వేణు మాధవ్ రూపు రేకలు అన్ని మారిపోయాయి.ఆ ఫోటోలను చూసిన వేణు మాధవ్ అభిమానులు షాక్ అయ్యారు.

రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 1, ఆదివారం 2024